26-5-2021 న గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం నిరాడంబరంగా కరోనా లాక్ డౌన్ నిబంధనలు కు అనుగుణంగా జరిగింది.స్వామి వారి కల్యాణం లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుటుంబం,మేనేజర్,అర్చకులు, సిబ్బంది తో పాటు ముఖ్యమైన భక్తులు పరిమిత సంఖ్యలో పాల్గోన్నారు. భక్తుల సౌకర్యార్థం ETV భారత్ ఛానల్ వారు కల్యాణం యావత్తు లైవ్ టెలికాస్ట్ చేశారు.దీనికి సహకరించిన ఏన్కూరు etv ప్రతినిధి లక్ష్మీశెట్టి నరసింహారావు గారికి దేవస్థానం తరపున ఫౌండర్ ట్రస్టీ శ్రీ మద్దిగుంట నరసింహా రావు గారు కృతజ్ఞతలు తెలిపారు.కల్యాణం లో పాల్గొన్న మహిళా భక్తులు మంగలహారతి తో కల్యాణ క్రతువు ముగిసింది.